- Step 1
చికెన్ను చిన్న చిన్న ముక్కలుగా కోసి, కడిగి పక్కన పెట్టుకోవాలి. మెంతికూరల ఆకులు వలిచి వుంచాలి.
- Step 2
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వుంచాలి.
- Step 3
అల్లం వెల్లుల్లి ఒకటిగా, ధనియాలు, గసగసాలు, ఒకటిగా నూరి వుంచాలి. పొయ్యిపై వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, మాంసం, ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి, ఉడికించాలి.
- Step 4
బాగా ఉడికిన తరువాత కాస్త నీళ్లు వుండగానే, మెంతికూర, ధనియాల పేస్ట్ వేసి, సన్నటి సెగన నీరు అయిపోయేంతవరకు ఉడకనివ్వాలి. ఆ తరువాత బాణళిలో కాస్త నూనె వేసి, లవంగాలు, దాల్చిన చెక్క, కాస్త వేగాక, ఉడికిన కూరను వేయాలి. నూనెలో కూర కలిసి, ఎర్రగా వేగాక తీసి వడ్డించాలి.