- Step 1
ముందుగా పనసకాయ ముక్కల్ని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుని ఉంచుకోవాలి.
- Step 2
స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పనసకాయ ముక్కల్ని చింతపండు రసం,ఉప్పు,పసుపు వేసి 20 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఒక బాణలిలో నూనె వేసి పోపు దినుసులు వేసుకుని అవి వేగాకా జీడిపప్పు,ఉల్లిముక్కలు వేసి అవి కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు & ఉల్లిముద్ద వేసి పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేయించాలి.
- Step 4
ఇప్పుడు అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న పనస ముక్కల్ని వేసి గరం మసాల పొడి,కారం వేసి, ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.
- Step 5
ఎంతవరకు అంటే నీరు అంతా పోయి నూనె పైకి తేలేంతవరకు.
- Step 6
అంతే ఇప్పుడు తయారైన కూరని ఒక డిష్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే.