- Step 1
మటన్ని కడిగి శుభ్రం చేసి నీరు ఇగిరి పొడిగా అయిందాకా ఉడికించండి.
- Step 2
ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి , టొమాటో ముక్కలు, మిరియాలు, ధనియాలు మెత్తగా రుబ్బి పెట్టుకోండి.
- Step 3
మూకుడులో నూనె వేడి చేసి మసాలా వేసి 7 లేక 8 నిమిషాలు నూనె తేలిందాకా వేగించండి.
- Step 4
తర్వాత ఉడికించిన మటన్ని వేసి మసాల దానికి బాగా పట్టేలా కలియబెట్టండి.
- Step 5
తరువాత తురిమిన కొబ్బరి వేసి మటన్ మసాలాని పూర్తిగా పీల్చుకునే దాకా ఉడికించండి.
- Step 6
ఒకవేళ బాగా పొడిగా అయినట్లు అనిపిస్తే కొద్దిగా నీరు చిలకరించండి.
- Step 7
పూర్తిగా ఉడికిన తరువాత తీసి పరాఠాలతో కానీ చపాతీతోగానీ వడ్డించండి. దాదాపు మన మటన్ ఇగురు కూరే ఇది.