- Step 1
ముందుగా పాన్ వేడి అయ్యాక నూనె వేయకుండ ఓట్స్ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు పాన్ లో నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు వేసి వేగనివ్వాలి. ఇందులో శనగపప్పు, మినప్పప్పు వేసి దోరాగా వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి.
- Step 3
ఇందులో ఉల్లి తరుగు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తరువాత క్యారెట్, టమాట, క్యాప్సీకమ్, పసుపు కారం, గరం మసాల వేసి వేయించాలి. వేరొక పాత్రలో రెండున్నర కప్పుల నీరు పోసి మరిగించాలి.
- Step 4
మరుగుతున్న నీళ్లలో వేయించి ఉంచ్చుకున్న ఓట్స్, టమాట మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
- Step 5
ఇందులో వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, నెయ్యి వేసి కలిపి దించాలి.