- Step 1
ముందుగా పచ్చి రొయ్యలను శుభ్రంగా కడుగుకోవాలి. వాటికి కాస్త పసుపు, ఉప్పు కలిపి నీరుపోసి ఉడకబెట్టుకోవాలి. వాటిని నీరు మొత్తం వంపి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
వంకాయలను ముక్కలుగా కోయ్యాలి. ఉల్లిపాయను, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
- Step 3
మరోపక్క నూనె బాణిలిలో నూనె వేడి చేసి ఉల్లి, మిర్చి ముక్కల్ని వేయించి, అల్లంపేస్టు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి
- Step 4
అందులోనే వంకాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి
- Step 5
మూతతీసి వుడికించిన రొయ్యలు వేసి రెండునిముషాలు వేయించి కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి చిన్నగ్లాస్ నీళ్ళు పోసి పదినిముషాలు వుడకనివ్వాలి.
- Step 6
కూర రెడీ అవ్వగానే గరంమషాలా, కొత్తిమీర చల్లి కలిపి మూతపెట్టి స్టవ్ ఆపాలి.